బోథ్, డిసెంబర్ 31: మండల కేంద్రంలోని నాగభూషణం పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కేక్ కట్ చేసి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిరికొండ, డిసెంబర్ 31 : మండల కేంద్రంలోని విజ్ఞాన్, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కేక్ కట్ చేశారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు అంగ శ్రీనివాస్, భిక్షపతి, సీతారాం, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
వేడుకలకు ఏర్పాట్లు
ఇంద్రవెల్లి/ ఉట్నూర్, డిసెంబర్ 31 : 2021 సంవత్సరానికి బైబై చెప్పి 2022కు స్వాగతం పలికేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్లోని పలు బేకరీల్లో కేకులను సిద్ధం చేసి ఉండగా గ్రామాల నుంచి యువతీ, యువకులు, విద్యార్థులు తరలివచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. దీంతో బేకరీల్లో సందడి కనిపించింది.