చిక్కడపల్లి: నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ కార్యానిర్వాహణాధికారిణి దీప్తి తెలిపారు. సోమవారం దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ నెల10 నుంచి 20 వరకు స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.
దేవాలయంలో విద్యుత్ దీపాల అలంకరణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు కూడా తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కారణంగా స్వామి వారికి జరిపే అన్ని రకాల కైంకర్యములు అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.