శేరిలింగంపల్లి :జాతీయ క్రీడా దినోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ తెలంగాణ(సాట్స్) అధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్విహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర క్రీడాశాఖ కార్యదర్శి, సాట్స్ వైస్ ఛైర్మన్ కేఏస్ శ్రీనివాసరాజు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలోని శ్రీ ద్యాన్చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని అథ్లెటిక్, బ్యాట్మింటిన్, వెస్లింగ్ క్రీడాపోటీల్లో గెలిచిన విజేతలకు మెడల్స్ అందజేశారు. సాట్స్ పరిపాలనాధికారి సుజాత, డిప్యూటీ డైరక్టర్లు ధనలక్ష్మీ, చంద్రారెడ్డి, డిప్యూటీ ఈఈ దీపక్, గచ్చిబౌలి స్టేడియం పరిపాలనాధికారి గోకుల్లతో పాటు పలువురు క్రీడా కోచ్లు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.