ముషీరాబాద్ : మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు నాయిని నర్సింహ్మారెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలను ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. నాయిని వర్థంతి సందర్భంగా పలు కూడళ్లలో అన్నదాన కార్యక్రమాలు, పండ్లు, దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన నాయిని వర్థంతి వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్మిక నేత, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డిలు వేరువేరుగా పాల్గొని నాయిని చిత్ర పటాలకు పూలమాలలు వేసిన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నాయిని పోరాట పటిమ ఎంతోమంది యువత, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కాంక్షించే వారికి స్పూర్తిగా నిలిచిందన్నారు.
తెలంగాణ తొలి హోంమంత్రిగా నాయిని రాష్ట్రానికి, ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్దికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. తొలి, మలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నాయిని అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు
. రాంనగర్ ఈసేవా వద్ద టీఆర్ఎస్ నేతలు నేత శ్రీనివాస్, సయ్యద్ అస్లాం, సత్యానగర్ కమ్యూనిటీహాల్, అడిక్మెట్లలో సురేందర్, బి.శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్సుందర్ల ఆధ్వర్యంలో జరిగిన నాయిని వర్థంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని నాయిని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. అల్ఫాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.