అత్తాపూర్ : శ్రీ మైసమ్మ తల్లి అమ్మవారి నామస్మరణతో అత్తాపూర్ రాంబాగ్ మారుమోగింది. రాంబాగ్లో మూడు రోజులుగా మైసమ్మతల్లి ప్రతిష్టాపన పూజలు జరుగుతున్నాయి. బుధవారం చివరి రోజున అమ్మవారి ప్రాణ ప్రతిష్టను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పకాష్గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం మహాఅన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రామ దేవత ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. పూజల సందర్బంగా నార్సింగి నర్సింగ్ రావు భజన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి గీతాలు అందరిని అలరించాయి. అమ్మవారి ఆలయం నిర్మించిన దాతలు జి. నర్సింలు యూదవ్, రాజు , రాజేందర్, నరేందర్, సత్యం, మల్లేష్ యాదవ్ లను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేందర్రెడ్డి, శ్రీరాంరెడ్డి, అమరేందర్, సురేష్రెడ్డి, చిన్న, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.