పవిత్ర కార్యానికి సిద్ధంకావాలి
రేపు రైతుబంధు ముగింపు వేడుకలు
పార్టీ శ్రేణులకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి దిశానిర్దేశం
రైతుబంధు ముగింపు సంబురాలకు సిద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతుబంధు సమితి శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రి కాన్ఫరెన్స్లో రైతుబంధు సమితి నాయకులు, అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు సందేశమందించారు. మంగళవారం గ్రామగ్రామానా నిర్వహించే ఉత్సవాలకు రైతులు, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని మంత్రి సూచించారు.
వనపర్తి, జనవరి 9(నమస్తే తెలంగాణ): రైతుబంధు ముగింపు సంబురాలకు మంగళవారం సిద్ధం కావాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతుబంధు సమితి శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతులకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఆయన కాన్ఫరెన్స్లో రైతుబంధు సమితి నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అన్ని వర్గాల ప్రజాప్రతినిధులకు సందేశమందించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఈ నెల 3నుంచి జరుగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో వెయ్యి డప్పుల ప్రదర్శనలకు తక్కువ కాకుండా సబ్బండవర్గాల కళాకారులతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే సంబురాలకు సిద్ధం కావాలన్నారు. నియోజకవర్గస్థాయిలో ఒకే ఊరేగింపు, మీటింగ్ నిర్వహించేలా ప్రణాళికలు లేదా పెబ్బేర్, శ్రీరంగాపురం మండలాలకు చెందిన రైతుబంధు సమితి ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పెబ్బేర్లో, వనపర్తి జిల్లా కేంద్రంతోపాటు వనపర్తి మండలం, పెద్దమందడి మండలాలు వనపర్తి జిల్లా కేంద్రంలో, గోపాల్పేట, రేవల్లి ప్రజాప్రతినిధులు గోపాల్పేట మండలకేంద్రంలో, ఖిల్లాఘణపురంలో ప్రత్యేకంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు పార్టీ శ్రేణులతో ప్రత్యేక ర్యాలీని నిర్వహించాలన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాకేంద్రంలో జరిగే సంబురాల్లో పాల్గొంటానన్నారు. ముందు వరుసలో డప్పు కళాకారుల ప్రదర్శన, రెండో వరుసలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ, శ్రేణుల ర్యాలీ, సబ్బండ వర్గాల కళాకారుల ప్రదర్శన ఉంటుందన్నారు. గ్రామగ్రామానా రైతులను పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని మంత్రి సూచించారు.
ప్రవీణ్కుమార్రెడ్డికి ఉత్తమ అవార్డు
పెబ్బేరు, జనవరి 9: వనపర్తి జిల్లా అద్వైత మామిడి రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ఉత్తమ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అవార్డు లభించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ వినియెగదారుల ఆరోగ్యానికి మేలు చేస్తూ ఆదర్శంగా నిలిచిన 20మంది రైతులకు ఆదివారం హైదరాబాద్లోని ఓ హోటల్లో అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. అద్వైత మామిడి రైతు ఉత్పత్తిదారుల సంస్థ చైర్మన్ పెబ్బేరు పట్టణానికి చెందిన తలకంటి ప్రవీణ్ కుమార్రెడ్డికి మంత్రి ఉత్తమ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అవార్డును అందజేశారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటేశ్వర్రావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ, వంశీకృష్ణ, రైతులు పాల్గొన్నారు.