HomeDistrictsMoosarambag Division With Rs 1 70 Crore For Development Works
రూ.1.70 కోట్ల నిధులతో..అభివృద్ధి పనులు
రూ.83.50 లక్షల పనులు ప్రారంభించాల్సి ఉంది
మూసారాంబాగ్ డివిజన్ ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్ మలక్పేట, డిసెంబర్ 3 : మూసారాంబాగ్ డివిజన్లో రూ.1,70,40,000 (కోటి డబ్బు లక్షల నలభై వేలు)నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతుండగా, మరో రూ.83.50 లక్షల నిధులతో చేపట్టనున్న పనులు ప్రారంభించాల్సి ఉందని డివిజన్ ఇంజినీరింగ్ విభాగం ఏఈ గుండ్రపల్లి వేణుగోపాల్ తెలిపారు. మూసారాంబాగ్ వార్డు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో రూ. 5.75 లక్షల నిధులతో వివిధ ప్రాంతాల్లో ఎస్డబ్ల్యూ డ్రైన్లపై స్లాబు నిర్మాణపనులు కొనసాగుతున్నాయని, రూ. 4 లక్షలతో మూసారాంబాగ్ బ్రిడ్జివద్ద దోబీఘాట్కు ప్రహరీ నిర్మాణం, చైన్లింక్ మెష్, రూ.33.50 లక్షలతో ఈస్ట్ ప్రశాంత్నగర్లో టైల్స్, రూ.14.40 లక్షలతో సలీంనగర్లోని ప్రియదర్శిని ప్లే గ్రౌండ్లో వాచ్మెన్ గది నిర్మాణ పనులు, రూ.15.20 లక్షలతో శ్రీపురం కాలనీ ఇండోర్ స్టేడియం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రూ.25.50 లక్షలతో శ్రీపురం కాలనీలోని దోబీఘాట్లో కమ్యూనిటీహాల్ నిర్మాణం, రూ.5.35 లక్షలతో టాటా టవర్స్ నుంచి వివేకానంద స్కూల్, శాలివాహననగర్ మూసీ నది వరకు ఎస్డబ్ల్యు డ్రైన్ డిసెల్టింగ్ మేయింటెనెన్స్ పనులు, రూ.3.70 లక్షలతో మూసారాంబాగ్ బస్తీ, గడ్డిఅన్నారం, శాలివాహననగర్ వరకు ఎస్డబ్ల్యు డ్రైన్ డిసెల్టింగ్ మెయింటెనెన్స్ పనులు, రూ.42.50 లక్షలతో విజేత శ్యామల టవర్స్ వద్ద వీడీసీసీ రోడ్డు నిర్మాణం, కట్టెలమండి దారిలో ఎస్డబ్ల్యు డ్రైన్ స్లాబ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, రూ.20.50 లక్షలతో సలీంనగర్లోని పర్హత్ నర్సింగ్హోం వద్ద సీసీ రోడ్డు నిర్మాణపనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్ని చివరి దశలో ఉన్నాయి.. కొన్ని పనులు సగం వరకు పూర్తి కాగా, కొన్ని చివరి దశలో ఉన్నాయి. రూ.3.70 లక్షలతో ఇంద్రానగర్లో ఆర్ఎంసీ నుంచి పెద్ద దారి వరకు సీసీ రోడ్డు నిర్మాణపనులు ప్రారంభించాల్సి ఉందని, రూ.5.10 లక్షలతో సలీంనగర్ జామా మసీదువద్ద సీసీ ప్యాచ్ వర్క్పనులు, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, రూ.6.20 లక్షలతో మూసారాంబాగ్లోని లార్వెన్స్ కాన్వెంట్ స్కూల్వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, రూ.3.50 లక్షలతో రేస్కోర్స్ గోడ పక్కన సీసీ ప్యాచ్ వర్క్ పనులు, రూ.3,50 లక్షలతో శాలివాహననగర్ మనోరమ రెసిడెన్సీ వద్ద ఎస్డబ్ల్యూ డ్రైన్ మరమ్మతు పనులు, రూ.5 లక్షలతో డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రబ్బర్ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, రూ.7.85 లక్షలతో మూసారాంబాగ్ దక్కన్ టవర్స్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణం, రూ.2 లక్షలతో ఎస్బీఐ పార్కువద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణపనులు, రూ.23.45 లక్షలతో గడ్డిఅన్నారంలోని రెడ్క్రాస్ దవాఖాన వద్ద వీడీసీసీ రోడ్డు నిర్మాణం, రూ.22 లక్షలతో వెస్ట్ ప్రశాంత్నగర్లోని విగ్రో సొసైటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, రూ.80 వేలతో మూసారాంబాగ్లోని రేణుక ఎల్లమ్మ ఆలయంవద్ద షెడ్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని వేణుగోపాల్ తెలిపారు. ఈ పనులను కూడా వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పనులన్ని పూర్తయితే మూసారాంబాగ్ సమస్యలు లేని డివిజన్గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులు నిర్ణీత గడువుగాలోగానే పూర్తయ్యేలా కృషిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.