బన్సీలాల్పేట్: న్యూబోయిగూడలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవినవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మూల నక్షత్రం రోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి కళా జనార్థన మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద బ్రాహ్మణులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఆలయం తరఫున శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ముషిరాబాద్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నగరం నలమూలల నుండి పెద్ద ఎత్తున హాజరైన తల్లిదండ్రులు చిన్నారులకు ఆక్షరాభ్యాసాలను చేయించారు.