ముషీరాబాద్ : అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీ-దీన్దయాల్నగర్ మార్గంలో రూ 4 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులను మంగళవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా మేడిబావి బస్తీ, దీన్ దదయాల్నగర్లో ప్రాంతంలో ఎదురవుతున్న మురుగు నీటి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
డివిజన్లో దశలవారిగా మురుగు నీటి లీకేజీ సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహ్మద్ జాహంగీర్, బి.శ్రీనివాసరెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, మాధవ్, శ్యామ్సుందర్, సయ్యద్ అస్లాం, బొట్టు శ్రీనివాస్, సుబ్బారావు, జెల్ల బిక్షపతి, , రవియాదవ్, మనోహర్,జెల్ల మాధవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.