గోల్నాక : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికసాయం అందజేస్తున్నామని ఎమ్మెలే కాలేరువెంకటేశ్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యా లయంలో అనారోగ్యానికి గురై దవాఖానాలో చికిత్స పొందుతున్న పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు.