చాదర్ఘాట్:పెండింగ్లో ఉన్న మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ ఏర్పాటు పనులను వెంటనే చేపట్టాలని మలక్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. గురువారం ఎమ్మెల్యే అహ్మద్ బలాల తన కార్యాలయంలో మలక్పేట సబ్డివిజన్ జలమండలి అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
సబ్ డివిజన్ పరిధిలోని ముసరాంబాగ్, పాతమలక్పేట, ఆజంపురా సెక్షన్లలో చేపట్టాల్సిన, పెండింగ్లో ఉన్న పనుల గురించి ఆరా తీశారు. ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. కలుషిత జలాల సరఫరా లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం లేకుండా చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీఎం షీలా రాణి, మేనేజర్లు హస్మత్ అలీ, చందూ నాయక్, మహేశ్ తదితరులు ఉన్నారు.