మణికొండ : ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులను మంజూరుచేసినా సకాలంలో పనులు చేపట్టక పోవడం సరికాదంటూ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ ఆర్అండ్బీ అధికారులపై అసహనం వ్యక్తంచేశారు. కోకాపేట-గండిపేట వరకు కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులను ఆయన అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కోకాపేట విజేత, రాజపుష్పా ముందు కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు.
గత రెండేండ్ల క్రితమే ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసం అవసరమైన నిధులను మంజూరుచేసినా పనుల్లో ఆలస్యం ఎందుకవుతుందని ఆయన ప్రశ్నించారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుండటంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్రిడ్జి పనులను పూర్తిచేసి వీలైనంత తొందరగా రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
అప్పటి వరకు రాకపోకల కోసం స్థానిక మున్సిపాలిటీ అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్యాదవ్, కమీషనర్ సత్యబాబు, డీఈ నర్సింహ్మరాజు, కౌన్సిలర్లు ఆదిత్యారెడ్డి, అరుణజ్యోతి, పత్తి శ్రీకాంత్, శివారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి.చంద్రశేఖర్రెడ్డి, పార్టీ నాయకులు నర్సింహ్మ, హరిశంకర్,రాము, కార్యకర్తలు పాల్గొన్నారు