బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్కాలనీలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద నూతనంగా నిర్మించతలపెట్టిన కమాన్ నిర్మాణ పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి సోమవారం ప్రారంభించారు.
రూ.11లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 20అడుగుల ఎత్తైన కమాన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని ఆలయ కమిటీ చైర్మన్ రాజా సంపత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, ప్రధాన కార్యదర్శి మాదాస్ ఆనంద్, గౌరీశంకర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.