మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈసందర్భంగా సీఎం కేసీఆర్కు విప్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. వారి నేతృత్వంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తామని విప్ గాంధీ పేర్కొన్నారు.