కొండాపూర్ : ప్రతిభావంతులైన పాత్రికేయులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తురగ ఫౌండేషన్ల మధ్య ఒప్పందంతో ప్రారంభించిన మీడియా ఫెలోషిప్లు దోహదపడతాయని హెచ్సీయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు పేర్కొన్నారు.
సోమవారం వర్సిటీ వీసీ సమక్షంలో హెచ్సీయూ రిజిస్ట్రార్ సర్ధార్ సింగ్, తురగ ఫౌండేషన్ ప్రతినిధులు వసంత శోభలు ఎంఓయూపై సంతకాలు చేసినట్లు తెలిపారు. ప్రింట్ అండ్ టెలివిజన్ రంగాలలో ఆసక్తి కలిగిన ప్రతిభావంతులైన యువకు లకు తోడ్పాటునిచ్చేందుకు మీడియా ఫెలోషిప్లు ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
ప్రతి సంవత్సరం ఫెలోషిప్ ద్వారా రూ. లక్ష మొత్తాన్ని వెచ్చించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వర్సిటీలోని కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ఈ కోర్సును కొనసాగించనున్నట్లు, కమ్యూనికేషన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ వాసుకీ బెల్వాడీ, సీనియర్ ప్రొఫెసర్ వినోద్ పావరాల ఆధ్వర్యంలో ఫెలోషిప్లు కొనసాగనున్నాయి.