పాపన్నపేట, అక్టోబర్ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవానీ మాత ఆలయంలో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం కాలరాత్రి(శ్రీసరస్వతీదేవి) రూపంలో తెలుపు రంగులో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్షెడ్లో వేద పండితులు అమ్మవారి చేతిలో వీణను ఉంచి సరస్వతీదేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. బుధవారం మహాగౌరీ రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.