మెదక్ నియోజకవర్గంలో 16 సబ్సెంటర్లు
నేషనల్ హెల్త్ స్కీం కింద
రూ.2.56 కోట్ల నిధులు మంజూరు
రాష్ట్రంలో కులవృత్తులకు పెద్దపీట
57 ఏండ్లకే పింఛన్లు, అర్హులందరికీ ‘డబుల్ బెడ్రూం’
ప్రైవేట్ దవాఖానలు ప్రజలకు సేవచేయాలి
రామాయంపేటలో సబ్సెంటర్కు ఎమ్మెల్యే భూమిపూజ
రామాయంపేట, ఆగస్టు 11: ప్రజారోగ్యాన్ని కాంక్షించి సీఎం కేసీఆర్ ఆరోగ్య ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేటలో సబ్సెంటర్ను, స్వర్ణకార సంఘం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టిందని, వీటిని ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. మెదక్ నియోజకవర్గవ్యాప్తంగా 16 సబ్సెంటర్లు మంజూరయ్యాయన్నారు. నేషనల్ హెల్త్ స్కీం కింద ఒక్కో సబ్సెంటర్కు రూ. 16 లక్షల చొప్పున మొత్తం రూ.2కోట్ల 56లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రైవేటు దవాఖానలు ప్రజలకు సేవ చేయాలి..
ప్రైవేటు దవాఖానలు డబ్బులు ఆశించకుండా నిరుపేదలకు సేవలందింనప్పుడే పేరు ప్రఖ్యాతలు వస్తాయని, వారు అర్ధరాత్రి వచ్చినా చికిత్సలు చేసేలా ఉండాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం రామాయంపేటలోని నూతనంగా ఓ ప్రైవేటు దవాఖానను ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు, రెండు మండలాల ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ ఎంపీపీ బిజ్జ సంపత్, పీఏసీఎస్ చైర్మన్లు అమరసేనారెడ్డి, బాల్రెడ్డి, దేవస్థాన చైర్మన్లు పాండురంగాచారి, మహేశ్, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు సుంకోజు దామోదర్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండల్రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస్, భిక్షపతి, మద్దెల రమేశ్, మెట్టు యాదగిరి, బాసం శ్రీనివాస్, బాలుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.