గోల్నాక: నియోజకవర్గ సమగ్ర అభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
గురువారం అంబర్పేట డివిజన్లోని అహ్మద్నగర్లో రూ.47 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నానన్నారు.
తాను హామీ ఇచ్చిన ప్రకారం త్వరలోనే హిందూ, ముస్లిం శ్మశాన వాటికలు ఏర్పాటు చేయనున్నామన్నారు.త్వరలోనే వీటి నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లు, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ తదితర వసుతుల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడు తున్నామన్నారు.
అనంతరం బస్తీలో పాదయాత్ర చేస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఆయన స్థానికులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబర్పేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, రామారావుయాదవ్, మల్లేష్యాదవ్, సతీష్, సలీం, ప్రవీణ్, ధర్మ, సతీష్గౌడ్, లత, గౌస్, దీపు, సాయితో పాటు బస్తీవాసులు దావూద్, మోహిన్, బాబా, నిజాం, మున్నా, సోహెల్, సులేమాన్, ఆజాం తదితరులు పాల్గొన్నారు.