జడ్చర్లటౌన్, జనవరి 6 : పట్టణంలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ని తెలంగాణ బొటానికల్ గార్డెన్ను గురువారం యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెస ర్ల బృందంతోపాటు కర్నూల్కు చెందిన అబ్దుల్హక్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సందర్శించారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్లో మొక్కల పెంపకాన్ని పరిశీలించి ప్రొ ఫెసర్ల బృందం సభ్యులకు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య వివరాలు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆకృతిలో రూపుదిద్దుకుంటున్న గార్డెన్లోని అటవీ, ఔషధ, అరుదైన మొక్కల పెంపకం గురించి వివరించారు. అనంతరం గార్డెన్లోని గ్రీన్హౌస్, నీటికుంటను పరిశీలించారు. గార్డెన్లో ఉన్న మొక్కలకు ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ను పరిశీలించారు. అనంతరం ప్రొఫెసర్లు మొక్కలు నాటి నీళ్లు పోశారు. డిగ్రీ కళాశాలలోని జంతుశాస్త్ర విభాగంలో భద్రపరిచిన వివిధ రకాల పాములను పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్హక్ ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బీ.శ్రీనివాసులు మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో పెరిగే అనేక రకాల అటవీ జాతుల మొక్కలను ఒకేచోట బొటానికల్ గార్డెన్లో పెంచుతుండడం ప్రకృతికి మణిహారంగా ఉన్నదని అభివర్ణించారు. యూనివర్సిటీ స్థాయిని మించి డిగ్రీ కళాశాలలో గార్డెన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈశ్వర్రెడ్డి, వెంకట సుబ్బయ్య, డాక్టర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ గార్డెన్లో మొక్కలతోపాటు పాములను సంరక్షించడం మంచి పద్ధతిగా పేర్కొన్నారు. యోగి వేమన యూనివర్సిటీకి బొ టానికల్ గార్డెన్తో మొక్కల సంరక్షణ, మార్పిడి చేసుకునే అవకాశంపై ఒప్పందం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి శ్రీనివాసులు, మైక్రోబయాలజీ విభాగాధిపతి శ్రీనివాసరావు, అధ్యాపకులు లత, పరిశోధక విద్యార్థులు రామకృష్ణ, శివకుమార్, రమాదేవి, శశిరేఖ, కావ్య, నందిని, పూజిత ఉన్నారు.