తుర్కపల్లి, జనవరి 8 : టీఆర్ఎస్ పాలనలోనే గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపురం నుంచి యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వరకు 2.9కిలోమీటర్ల మేర రూ.1.65కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం యాదాద్రి పరిసర ప్రాంతాల్లోని అన్ని రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తుందన్నారు. ఇప్పటికే యాదాద్రి నుంచి జంగంపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం నిర్మిస్తున్న రాంపురంజంగంపల్లి రోడ్డు పనులు పూర్తయితే మండల ప్రజలకు యాదాద్రికి వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. జడ్పీవైస్చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచులు మంజులామహేందర్, గుండ్ల సరిత, మహేందర్, రాంమెహన్శర్మ, మల్లప్ప, ఎంపీటీసీ ప్రతిభారాజేశ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, టీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దునాయక్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్గౌడ్, శట్టయ్య, కర్ణాకర్రెడ్డి, భాస్కర్నాయక్ పాల్గొన్నారు.
హైమాస్ట్ లైట్లు ప్రారంభం
బొమ్మలరామారం : మండల కేంద్రం తో పాటుగా చీకటిమామిడి గ్రామాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి శనివారం హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, గొడగు శోభచంద్రమౌళి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాల్నర్సింహ, పార్టీ మండలాధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, సర్పంచులు వసంతాశ్రీనివాస్గౌడ్, రాంపల్లి మహేశ్, మైలారం ఈదమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంరెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, మల్లేశ్, ఉపేందర్, మంజుల, బాలునాయక్, రాజేశ్ పాల్గొన్నారు.