తెలంగాణ ఏర్పడ్డాకే గ్రంథాలయాలకు మంచి రోజులు వచ్చాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శనివారం బాదేపల్లి,కావేరమ్మపేటలో నిర్మించిన గ్రంథాలయ భవనాలను ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్లో విలువైన ప్రాంతంగా ఉమ్మడి జిల్లాను తీర్చిదిద్దుతామన్నారు.
జడ్చర్లటౌన్, జనవరి 8 : టీర్ఎస్ హయాంలో అన్ని రకాల వసతులతో గ్రంథాలయాలకు మహర్దశ లభించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తె లిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో రూ.20 లక్షలతో, బాదేపల్లిలో రూ.15 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాలను శనివారం ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌ డ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక సాగునీరు, విద్యుత్, వ్యవసాయంపై దృషి సారించినట్లు తెలిపారు. నేడు గ్రా మాలు, పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంగా అవతరిస్తున్న రా ష్ట్రంలో ప్రజలకు బంగారు భవిష్యత్ అందిస్తున్నదన్నా రు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. ఉమ్మడి జిల్లాలోని అ న్ని గ్రంథాలయాల అభివృద్ధి జరుగుతున్నదని చెప్పా రు. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో సమాంతరంగా అభివృద్ధి పనులతో పాటు టూరిజం, గ్రంథాలయాలు, ఇతర పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే మహబూబ్నగర్, జ డ్చర్ల, భూత్పూరు ప్రాంతాలను కలిసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఏర్పాటు కాబోతుందన్నారు. మ న్యంకొండ ప్రాంతంలో ఎయిర్పోర్టు రానున్నదని తెలిపారు. భవిష్యత్తులో అత్యంత విలువైన ప్రాంతంగా ఉ మ్మడి జిల్లా రూపుదిద్దుకుంటుందన్నారు. ఎమ్మెల్యే ల క్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మార్పు వచ్చిందన్నారు. నాలుగేండ్లలో రైతుబంధు కింద రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ య్యాయనారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.50 కూడా జమకాలేదని చెప్పారు. అనంతరం గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన వారిని మంత్రి శ్రీనివాస్గౌడ్ సత్కరించారు. అలాగే వంశీ దవాఖాన మొదటి వార్షికోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రం థాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, జెడ్పీ వై స్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్పర్సన్ సారి క, గ్రంథాలయాల శాఖ జిల్లా అధికారి మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.