నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. మొత్తం 1,271 ఓటర్లకు గానూ 1,233 మంది ఓటింగ్లో పాల్గొనడంతో 97.01 శాతం పోలింగ్ నమోదైంది . శుక్రవారం 8 కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా, అత్యధికంగా భువనగిరిలో నూరు శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అత్యల్పంగా చౌటుప్పల్లో 85.84 శాతం నమోదైంది.ఎక్స్అఫీషియో ఓటర్లలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు, సీపీఎంకు చెందిన ఒక్కరు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. హుజూర్నగర్లో ఎంపీ బడుగుల, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, నల్లగొండలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, భువనగిరిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్లగొండ మహిళా ప్రాంగణం పరిధిలోని స్ట్రాంగ్కు తరలించి భద్రపరిచారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న ఓట్ల లెక్కింపు ఉంది.
తమ పార్టీ అభ్యర్థులు బరిలో లేకపోయినా ఊహించని విధంగా కాంగ్రెస్, బీజేపీ ఓటర్లంతా పోలింగ్కు తరలిరావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతల తీరుపై గుస్సాతో ఓటర్లంతా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి ఓటు వేసేందుకు తరలివచ్చినట్లు ఆయా సెంటర్ల దగ్గరి పరిస్థితి స్పష్టం చేసింది. పార్టీలకు అతీతంగా ఏకపక్షంగా టీఆర్ఎస్కే ఓట్లు పోలైనట్లు తేటతెల్లమైంది. ఇదే విషయమై సూర్యాపేటలో ఓటేసిన అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి స్పందిస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతున్నదని
ప్రకటించారు.
శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 పట్టణాల్లో నిర్వహించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి బారులు దీరారు. డివిజన్ వారీగా ప్రజాప్రతినిధులు, నాయకులంతా తరలిరావడంతో సందడి నెలకొంది. చంటి బిడ్డలతో వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులకు పోలీస్ సిబ్బంది సహకరించారు. చిన్నారులను మహిళా కానిస్టేబుళ్లు ఎత్తుకొని ఆడిస్తూ కనిపించారు. ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది శానిటైజర్ అందించారు.
కేసీఆర్కు బహుమతిగా ఇస్తాం..
టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుని సీఎం కేసీఆర్కు నల్లగొండ జిల్లా తరఫున బహుమతిగా అందిస్తాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కనీసం ఓటుహక్కు కూడా వినియోగించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. విపక్షాల ఓటర్లంతా కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ముందుకు వచ్చి టీఆర్ఎస్కు ఓటేశారు. ఊహించని మెజార్టీతో కోటిరెడ్డి విజయం ఖాయం.
పోటీ చేసే పరిస్థితుల్లో రెండు జాతీయ పార్టీలు లేవు
రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేసే పరిస్థితిలో లేవంటే ఎంత శోచనీయమైన పరిస్థితిలో ఉన్నాయో స్థానిక ప్రజాప్రతినిధులు అర్థం చేసుకున్నారు. ఊరికే ప్రగల్భాలు మాట్లాడుతూ ‘టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారుతాం.. అధికారంలోకి వస్తా’మంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపు ఖాయమైంది.
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష. టీఆర్ఎస్కు ఉన్న ఆదరణతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండానే పలాయనం చిత్తగించింది. స్థానిక సంస్థల బలోపేతం కేసీఆర్తోనే సాధ్యమని విశ్వసిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు ఓటు వేశారు. టీఆర్ఎస్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కోటిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకే.. ఓటర్లంతా టీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలందరూ టీఆర్ఎస్కే ఓటు వేస్తున్నారు. కోటిరెడ్డి గెలుపు ఖాయం.
కోటిరెడ్డి విజయం ఖాయం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డి విజయం ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు సైతం కోటిరెడ్డికి ఓటు వేయడం జరిగిందన్నారు. ఊఃహించనంత భారీ మెజార్టీతో కోటిరెడ్డి గెలుస్తారు.
భారీ మెజార్టీతో గెలుస్తాం
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాల వల్లనే ప్రజలు పార్టీకి చేరువయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతలు. పార్టీ, సీఎం కేసీఆర్పై ఉన్న ప్రజాభిమానంతో భారీ మెజార్టీతో గెలువబోతున్నాను.
ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరుకని పరిస్థితి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితులు మారాయి. ప్రతిపక్షాలకు కనీసం అభ్యర్థులు దొరుకని పరిస్థితి. హుజూర్నగర్ నియోజవర్గ ప్రజలు చైతన్యవంతులని, ఇక్కడి ప్రజాప్రతినిధులు రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకే మరోసారి పట్టం కడతారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ.కోటిరెడ్డికి ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ వస్తుంది.
రాజ్యసభ సభ్యుడు
టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న టీఆర్ఎస్.. ఎన్నికలు జరుగుతున్న మరో ఆరు స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తుంది. నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఈ ఎన్నికల్లో మరోసారి నిరూపితం అవుతుంది. కోటిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అభ్యర్థులు లేకపోవడం చూసి జాలేస్తున్నది. భవ్యిత్తులో సైతం ఆ పార్టీలకు అభ్యర్థులు దొరకరు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రైతుల గోడు పట్టించుకోని బీజేపీ నేతలు ఎన్నికల్లో మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నరు.
టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు
టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఎదురులేదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు. అభ్యర్థి నిలిపే ధైర్యం చేయలేక కాంగ్రెస్ పార్టీ చతికిలాబడింది.
మిర్యాలగూడ ఎమ్మెల్యే భారీ మెజార్టీ ఖాయం
టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయం. మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో పార్టీ శ్రేణులు కోటిరెడ్డి గెలువాలని కష్టపడ్డాయి. నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి విజయాన్ని సీఎం కేసీఆర్కు జిల్లా మంత్రి సారథ్యంలో బహుమతిగా అందిస్తాం.
ఎవరికి ఓటెయ్యాలో కూడా చెప్పలేని స్థితిలో కాంగ్రెస్ పెద్దలు
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్, కోమటిరెడ్డి అనాథగా వదిలేశారు. కేడర్ జెండాలు మోసి కష్టపడితే గెలిచిన వాళ్లకు ఈ ఎన్నికల్లో కనీసం ఎవరికి ఓటెయ్యాలో కూడా చెప్పే తీరిక లేకుండా పోయింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలపై పార్టీ శ్రేణులు, మొత్తం క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ సభ్యుడినైనా కనీసం మద్దతు ప్రకటించే ధైర్యం కూడా చేయలేకపోయారు. నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే కూడా కాంగ్రెస్ నేతలే ఇబ్బందిపడ్డారు. ఇలాంటి నేతలు క్యాడర్కు ఏం సందేశం ఇస్తున్నారు.