సుల్తాన్బజార్ : ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అణుగుణంగా నూతన సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బర్కత్పురా డిపో మేనేజర్ వెంకట్రెడ్డి అన్నారు. డిపో ఆధ్వర్యం లో హైదరాబాద్ నుండి షోలాపూర్ వరకు నూతన సూపర్ లగ్జరీ బస్సును ఆయన శనివారం జెండా ఊపి ప్రారంభించారు.
అనంత రం ఆయన మాట్లాడుతూ నూతన సర్వీస్ బస్సు ఎంజీబీఎస్ నుండి ప్రతి రోజు నాలుగు గంటలకు బయలు దేరి సంగారెడ్డి, సదాశివాపే ట్, జహీరాబాద్, హుమ్నాబాద్, ఓమెర్గా, నల్దుర్గ్ మీదుగా షోలాపూర్కు చేరుకుంటుందన్నారు. షోలాపూర్ నుండి తిరిగి 5.30 గంటలకు బస్సులు బయలుదేరుతాయని అన్నారు.
ఎంజీబీఎస్ నుండి షోలాపూర్ వరకు 433 రూపాయల ఛార్జీ ఉంటుం దన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.