కొండాపూర్ : కార్తీక మాస ప్రత్యేక పూజలను పురస్కరించుకుని చందానగర్ శిల్పా ఎన్క్లేవ్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో లక్ష దీపోత్సవ వేడుకలను ఏడవ రోజు ఘనంగా నిర్వహించారు.
దీపోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంగళవారం శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కార్తీక మాస ప్రత్యేక పూజలకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం భక్తులకు ఆశీర్వాచనాలు అందజేసి, కార్తీకమాస విశిష్టతను వివరించారు. పూజలు ఆలయ ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందం పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. కాలనీతో పాటు చుట్టు ప్రక్కల నుంచి విచ్చేసిన భక్తులు ఏడవ రోజు లక్షదీపోత్సవంలో భాగంగా పదివేల దీపాలు వెలిగించారు.