వెంగళరావునగర్ : మీ బ్యాంకు అకౌంట్ తాత్కాలికంగా హోల్డ్లో ఉంచాం..తక్షణం కేవైసీ అప్డేట్ చేయండి అంటూ వచ్చిన ఓ నకిలీ సందేశం వ్యక్తి బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసింది. ఈ సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది…ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం…
వి.మహేష్ ప్రైవేటు జాబ్ చేస్తూ బల్కంపేటలోని ఎ-1 బాయిస్ హాస్టల్లో ఉంటున్నాడు. మహేష్ సెల్ఫోన్కు మంగళ వారం సాయంత్రం ఓ మెస్సేజ్ వచ్చింది. మీ ఎస్బీఐ అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేశాం. తక్షణం మీ కైవైసీ ని అప్డేట్ చేయడానికి అప్డేట్ డాట్ కామ్ లోకి వెళ్లాలని వెబ్సైట్ లింకు పంపారు.
రెండు సార్లు వేర్వేరు నంబర్లతో ఈ తరహా మెస్సేజ్ రావడంతో వెబ్సైట్లోకి వెళ్లి తన వివరాలను నమోదు చేశాడు. వెంట నే అతని ఖాతా నుంచి రూ.25 వేలు ఒకసారి, రూ.20 వేలు మరో సారి డ్రా అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహిం చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.