మహేశ్వరం : విద్య విలువ తెలుసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కుగూడ పర్యటనలో బాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి రాగ అంగడిలో కూరగాయలు అమ్ముకుంటూ ఒక బాలుడు కనిపించాడు.
వెంటనే ఆ బాలుడి వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. చదువుకోవాలని ఆబాలుడికి హితభోద చేశారు. బాలుడి వివరాలను తెలుసుకొని ఎన్డీ తండా గ్రామ సర్పంచ్ మెగావత్ రాజు నాయక్కు పోన్చేసి ఆబాలుడిని చదువుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు. తల్లి దండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు చదువు ద్వారానే బాటలు వేయాలని ఆమె అన్నారు.