వనస్థలిపురం : ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ నందనవనంలో పోలీస్ఔట్పోస్టు ఏర్పాటు చేస్తానని గతంలో హామీ ఇచ్చానని, ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించి ఔట్ పోస్టును మంజూరు చేయించానన్నారు.
దానికోసం గురువారం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. చివరికి మోడల్ మార్కెట్ పై అంతస్తు లో ఔట్పోస్ట్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో మన పోలీసులు బాగా పనిచేస్తున్నారన్నారు.
నందనవనం ప్రాంతంలో ప్రజలకు రక్షణగా ఔట్పోస్టు పనిచేస్తుందన్నారు. త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, మీర్పేట్ సీఐ మహేందర్, నాయకులు శ్రీనివాస్యాదవ్, డేరంగుల కృష్ణ, ఆదిలక్ష్మి, సయ్యద్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.