ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ ఫార్మసీ విభాగంలో క్యాతం రమాదేవి డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ కేఎస్కే రావు పట్నాయక్, ప్రొఫెసర్ అశోక్ల పర్యవేక్షణలో ‘మైక్రోవేవ్ అసిస్టెడ్ సింథసిస్ ఆఫ్ నైట్రోజన్ హెటిరో సైక్లిక్ కాంపౌండ్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దెయిర్ ఫార్మకాలాజికల్ యాక్టివిటీస్’అనే అంశంపై రమాదేవి పరిశోధన పూర్తి చేశారు.
రమాదేవి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచి అధికారులు ఆమెకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించి, పట్టుదలతో చదివి అత్యున్నత పట్టా సాధించారు.
ప్రస్తుతం ఆమె అనురాగ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. పరిశోధనా క్రమంలో ఆమె రూపొందించిన పలు పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఈ సందర్భంగా ఆమెను పలువురు అధికారులు, అధ్యాపకులు అభినందించారు.