మన్సూరాబాద్ : కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మన్సూరాబాద్, నాగోల్ డివిజన్ల పరిధి సహారాఎస్టేట్స్కాలనీలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం, సెంట్రల్బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయం, శివగంగాకాలనీలోని శ్రీ సదాశివేశ్వరాలయం, శివపురికాలనీలోని శివాలయం, శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.
కార్తీక సోమవారంను పురస్కరించుకుని ఆయా ఆలయాలలో భిల్వార్చన, పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీల ప్రతినిధులు మాట్లాడుతూ కార్తీకమాసంను పురస్కరించుకుని పరమశివుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుని పూజలు జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సహారాఎస్టేట్స్కాలనీ ఆలయ కమిటీ అధ్యక్షులు తులసమ్మ, శ్రీదుర్గాదేవి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన గణేష్యాదవ్, సెంట్రల్బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఫౌండర్, చైర్మన్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.