చిక్కడపల్లి : ఆత్మ రక్షణ, దేహదారుఢ్యం, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడే కరాటేను రెండు తెలుగు రాష్ట్రాల పాఠశాలల్లో ప్రవేశ పెట్టాలని ప్రముఖ సినీనటుడు సుమన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.రుద్రమదేవి షోటోకాన్ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆధివారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీనియర్ బ్లాక్బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్, విద్యార్థులకు బెల్ట్లు, సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ విద్యార్థులకు బెల్ట్లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠాశాలల్లో కరాటే తరగతులు ప్రవేశపేడితే బాలలకు ఎంతో ఉపాయోగ పడుతుందని, ఆత్మరక్షణ తో పాటు దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపకురాలు లక్ష్మి, రవి, చందు, శ్రీనివాస్ రావు, డి.ఎస్.రెడ్డి, సంగీత దర్శకుడు బోలే షావలి, తదితరులు పాల్గొన్నారు.