బన్సీలాల్పేట్ : గుండెపోటు తో మృతి చెందిన డాక్టర్ టి.పూర్ణచంద్ర గుప్తా (28)కు గాంధీ దవాఖానలోని సహచర వైద్యులు, జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిథులు నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ విగ్రహం వరకు బ్యానర్ పట్టుకుని, కొన్వొత్తులతొ ర్యాలి నిర్వహించారు.
తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.కార్తిక్ మాట్లాడుతూ ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన యువ డాక్టర్ అకస్మాత్తుగా మరణించడం ఎంతో బాధాకరమని అన్నారు. అతడి మృతి పట్ల జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సాగర్, సహ అధ్యక్షుడు డాక్టర్ వివేక్, ఇతర కార్యవర్గం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నదని అన్నారు.