మణికొండ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు.
గండిపేట మండల పరిధిలోని వట్టినాగుల పల్లి కి చెందిన వివిధ పార్టీల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున మండల అధ్యక్షుడు రామేశ్వరం నరసింహ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బం గా అయన పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి అహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎనలేని ఆదరణ లభిస్తుందన్నారు. నిరు పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందన్నారు. అన్ని వర్గాల వారికి కేసీఆర్ సమూచిత న్యాయం కల్పిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖాయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, మాజీ ఎంపీపీ తలారి మల్లేష్, టీఆర్ఎస్ నాయకులు గణేష్సింగ్, నాగేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.