కాచిగూడ : నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించు కేంద్ర ప్రభుత్వ ఫైర్, సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఆడప విమలారెడ్డి తెలిపారు.
మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి కోసం ఫైర్, సేఫ్టీ కోర్సులలో చేరేందుకు ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతీ, యువకులు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులని ఆమె పేర్కొన్నారు. ఫైర్ అండ్ సేఫ్టీ, సేప్టీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు పేరొందిన పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, వివిధ నిర్మాణరంగ సంస్థలు, ఎయిర్పోర్ట్, పవర్ ప్లాంట్స్, పేరొందిన దవాఖానల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.
అలాగే అయిల్ కంపెనీలు, గ్యాస్ ఇండస్ట్రీస్, దేశ, విదేశ స్టార్ హోటల్స్, బిగ్మాల్స్, ఫార్మాస్పూటికల్ ఇండస్ట్రీస్, రైల్వేస్, మైనింగ్ మొదలగు సంస్థలలో ఫైర్ ఆఫీసర్, సేఫ్టీ ఇంజనీర్, సేఫ్టీసూపర్వైజర్, ఫైర్మెన్, సెక్యూరిటీ మేనేజర్లుగా అవకాశాలు పొందవచ్చని ఆమె వెల్లడించారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 25వ తేదీలోపు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.ncttindia.com , 9701496748 లో సంప్రదించవచ్చని తెలిపారు.