పహాడీషరీఫ్, బడంగ్పేట,కందుకూరు, ఆర్కేపురం : మాజీమంత్రి, ప్రస్తుత విద్యాశాఖమంత్రి సబితారెడ్డి భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన సతీమణి రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కౌకుంట్ల లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.
అలాగే బడంగ్పేట మున్సిపల్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి ముఖ్య అతిధిగా హజర్ అయారు. ఇంద్రారెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.
అల్మాస్గూడ 5వ డివిజన్లో కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి విగ్రహనికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు.
రంగారెడ్డి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకుడు స్వర్గీయ మాజీ హోంమంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి అని సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ పేర్కొన్నారు. పట్లోళ్ల ఇంద్రారెడ్డి జయంతి కార్యక్రమాన్ని సోమవారం డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించి 200 మందికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి చిత్ర పటానికి నివాళులర్పించారు.