ఆర్కేపురం : ప్రపంచ దేశాలలో భారతీయ సాహిత్యానికి విశిష్ట గుర్తింపు కలదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావు అన్నారు. కొత్తపేటలోని ఓ హోటల్లో చేతనా స్రవంతి, నవయుగ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తసిక్త భారతం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాలు, గ్రంథాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి, సాహిత్యానికి విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రతి వ్యక్తి సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. హైదరాబాద్కు అన్నివిధాలుగా ఆమోదయోగ్యమయ్యే భాగ్యలక్ష్మీనగర్ అనే నామకరణం చేయాలన్నారు.
దేశాన్నిపట్టి పీడించే శక్తులను పారద్రోలడం భారతీయుల భాధ్యతన్నారు. ఈ కార్యక్రమంలో నవయుగ భారతీ చైర్మన్ బాలేంద్ర, రచయితలు బినయ్ కుమార్ సింగ్, వి.వి నరేంద్రజీ ఠాకూర్, సురేంద్రరెడ్డి, చక్రధర్రెడ్డి పాల్గొన్నారు.