మణికొండ:శ్రావణమాస పూజల్లో భాగంగా ఆదివారం మార్వాడీలు నిర్వహించిన కావడి యాత్ర చూపరులను ఆకట్టుకుంది. హైదరాబాద్ నగరంలోని బేగంపేట నుంచి నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల మహాదేవి మచిలేశ్వరాలయం వరకు ఈ యాత్ర సాగింది.
నగరం నలుమూలలకు చెందిన మార్వాడీలు కాలినడకన కావడిని చేతబూని అమ్మవారికి సమర్పించేందుకు వందలాదిగా తరలివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక పోలీసులు, ఆలయకమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.