హయత్నగర్ : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హయత్నగర్ డివిజన్ కుమ్మరికుంట, తూర్పుసాయినగర్ కాలనీకి చెందిన కేతావత్ లక్ష్మి(40), అదే కాలనీకి చెందిన కేతావత్ గణేష్(19), యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం, జామ్పల్లి గ్రామానికి చెందిన దేవసోతు నాగేష్ (32), అదే గ్రామానికి చెందిన దేవసోతు శ్రీకాంత్(24) కలిసి హయత్నగర్ నుండి యాదాద్రి భువనగిరికి మినీ వ్యాన్లో 28.50 క్వింటాళ్ల బియ్యాన్ని గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్నారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి హైమద్ అలీ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడులు నిర్వహించి నలుగురు నిర్వాహకులతోపాటు మినీ వ్యాన్, 28.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసు కుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.