బంజారాహిల్స్ : మత సామరస్యానికి, ప్రజల్లో సోదరభావం పెంచడంలో ఇఫ్తార్ విందులు దోహదపడుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ.విజయారెడ్డి ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని లేక్వ్యూ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. గంగా జమునా తెహజీబ్కు మారుపేరైన హైదరాబాద్ నగరంలో రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామరస్యాన్ని మరింత పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మత పెద్దలు పాల్గొన్నారు.