తుర్కపల్లి, జనవరి 2 : మానవత్వమే సర్వమతాల సారమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. హైదరాబాద్కు చెందిన రెస్బాక్ రూ.50లక్షలతో మండల కేంద్రంలో నిర్మించిన మసీదును ఆదివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మతం ఏదైనా సాటి మానవుడికి సాయం అందించినప్పుడే ఆ వ్యక్తి దేవుడి కృపకు పాత్రుడవుతాడన్నాడు. ఆలయాలు, మసీదులు, చర్చీలేవైనా మానవాళికి ప్రశాంతతను అందిస్తాయన్నారు. మైనార్టీలు బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మహిళలు విద్యావంతులైనప్పుడే ఆ ఇల్లు, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. వారి విద్యకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. మైనార్టీ యువతుల వివాహానికి షాదీ ముబారక్ పథకంతో సాయమందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొనారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో మెలిగి మత సామరస్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పలుగుల నవీన్కుమార్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోగుల ఆంజనేయులు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొమిరిశెట్టి నర్సింహులు, సర్పంచ్ పడాల వనితాశ్రీనివాస్, ఎంపీటీసీ బోరెడ్డి వనజ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల, బద్దూనాయక్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ పరమేశ్, అధికార ప్రతినిధి తలారి శ్రీను, పడాల చంద్రం, బోరెడ్డి రాంరెడ్డి, సుంకరి శట్టయ్య, రవీంద్రనాథ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు రహమత్ షరీఫ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు చాంద్పాషా పాల్గొన్నారు.
ప్రభుత్వవిప్ సునీతకు శుభాకాంక్షలు
తుర్కపల్లి మండల సర్పంచులు మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సర్పంచుల ఫోరం మండలాధ్యక్ష, ఉపాధ్యక్షులు పోగుల ఆంజనేయులు, నామసాని సత్యనారాయణ, సర్పంచులు పడాల వనిత, శ్రీనివాస్రెడ్డి, మల్లేశం, ఇమ్మడి మల్లప్ప ఉన్నారు.