అమీర్పేట్ : సీఎం కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద ఓ దివ్యాంగునికి హోండా యాక్టివాను మంత్రి తలసాని బహుకరించారు.
సనత్నగర్ సాయిబాబానగర్కు చెందిన గోపికి ఓ ద్వీచక్ర వాహనం ఉంటే తన పనులను మరింత సమర్ధవంతంగా చక్కబెట్టుకో గలడన్న సనత్నగర్ కార్పొరేటర్ సూచనలకు మంత్రి తలసాని స్పందించారు. సోమవారం ఉదయం మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో గోపికి హోండా యాక్టివాను మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సనత్నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.