హిమాయత్నగర్ : రాష్ట్రంలోని పద్మశాలీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు.
ఇటీవల కరీంనగర్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎల్.రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నారాయణ గూడలోని పద్మశాలీ భవన్ వద్ద ఉన్న కీర్తి శేషులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.
పద్మశాలీ కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి రమణకు పూల బోకేలు అందించి శాలువలతో సత్కరించారు.ఈ సందర్భం గా రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించి వారి సంక్షేమం కోసం తనవంతు తోడ్పాటు నంది స్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్య క్షుడు శ్రీధర్ ఎన్.సుంకుర్వార్, జాతీయ ఉపాధ్యక్షుడు కందగట్లస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబురావు, నాయకులు పుట్ట పాండురంగయ్య, వనం దుశ్యంతల, మసున మోహన్ నారాయణ, జగన్నాథం, కత్తుల సుదర్శన్రావు, అవ్వారి భాస్కర్, గుండేటి శ్రీధర్, ఆలేశంకర్, విఠల్, యరమాద వెంకన్న, వేణుమాధవ్,రూప,దిడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.