శంషాబాద్ రూరల్ : ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఆ దిశగానే రాష్ర్టంలో కొవిద్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని జూకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కోడూరి నర్సమ్మ అధ్యక్షతన కరోనా టీకా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలోముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇప్పటీకే రాష్ట్ర వ్యాప్తంగా 2కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేశామని వివరించారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి టీకాలు వేసేందుకు ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఒక గ్రామంలో ఒకరోజు పూర్తికాకుంటే రెండు రోజుల పాటు గ్రామాలలో సెంటర్లు ఏర్పాటు చేసి అందరికీ టీకాలు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, డీఎల్పీవో అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ నీలంనాయక్, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంపీవో సురేందర్రెడ్డి, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి. పెద్దషాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు రమ్య, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండు ఇస్తారి, సర్పంచ్ రాజ్కుమార్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, మాజీ ఎంపీటీసీ మోహన్నాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శేఖర్రెడ్డి, నాయకులు సత్యనందం, హేమ్లానాయక్, వెంకటేశ్, మైలారం భిక్షపతి , జుర్కి రమేష్ తదితరులు పాల్గొన్నారు.