కొండాపూర్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సుధాకరరావు యూనివర్సిటీలో చేరకపూర్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, రాజమహేంద్రవరంలో పనిచేశారు. ఆయన ప్రముఖ కవి, పరిశోధకుడుగా ప్రసిద్ధి చెందారు. గత కొంతకాలంగా ఆయన డయాబెటిస్, శ్వాస కోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే రెండు సార్లు గుండె ఆపరేషన్లు సైతం చేయించుకున్నారు. సుధాకరరావు మరణానికి హెచ్సీయూ తెలుగు శాఖ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులు అర్పించినట్లు వర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలిపారు.