హయత్నగర్ : ప్రభుత్వం దృష్టికి ఎల్బీనగర్ గుంటి జంగయ్య కాలనీవాసుల సమస్యను తీసుకెళ్లి భూ రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న నేపథ్యంలో వనస్థలిపురం డివిజన్ పరిధిలోని లాల్బదూర్ నగర్ రెవెన్యూ విలేజ్ గుంటి జంగయ్యనగర్ కాలనీ బస్తీవాసులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
దాదాపు 12 ఎకరాల స్థలంలో 700 ఇండ్లు ఉన్నాయని, గతంలో 58, 59 జీఓ కింద కొన్ని ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేశా రని, మిగతా ఇండ్లకు కూడా 58, 59 జీఓల కింద రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలనీవాసుల రిజిస్ట్రేషన్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్, బస్తీవాసులు పాల్గొన్నారు.