గోల్నాక : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల తాసీల్ధార్ సాయిరాజు, కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మావెంకట్రెడ్డి తదితరులతో కలసి 80 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన రూ.80 లక్షల 9వేల 8280 విలువగల చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ… ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద అందచేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు బీవీ.మహేష్రాజుతో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.