మైలార్దేవ్పల్లి : దసరా నవరాత్రులలో భాగంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి తల్లి కటాక్షం ఎల్లప్పుడు ఉంటుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టిప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలీపురం భూలక్ష్మమ్మ ఆలయం ప్రాంగణంలో జైమాతాదీయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న దసరా నవరాత్రులలో భాగంగా అమ్మవారి మండప కట్టే పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అనంతరం భూలక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లా డుతూ.. పద్మశాలీపురంలో గత 2ఏ ఏండ్లుగా అమ్మవారి నవరాత్రులు నిర్వహించడం విశేషమని అన్నారు. దసరా పండుగ సందర్భంగా కాలనీలలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. కరోనా దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ పూజలు నిర్వహించాలని మండప నిర్వాహకులకు సూచించారు.
ప్రతి సంవత్సరం మాదిరిగా ప్రభుత్వం దసరా పండుగకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. అర్హులైన పేద ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్దాస్ గౌడ్, సరికొండ వెంకటేష్, డివిజన్ యూత్ అధ్యక్షుడు రాఘవేందర్యాదవ్, కాశీగారి యాదగిరి, సంకూరి జయప్రకాష్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.