మన్సూరాబాద్ : నాగోల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తి, శ్రద్ధలతో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ, నాయకులు సుధాకరా చారి, ఇంద్రాల ముత్యాలు, కొలన్ నరసింహా, పల్లె సీతారాములు, బద్దం మహేందర్ గౌడ్, వస్పరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.