అబిడ్స్ : దీపావళి పండుగను పురస్కరించుకుని సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి వరకు పుర వీధులలో సదర్ ఉత్సవాలను నిర్వహించిన యాదవ సోదరులు, శనివారం నగరంలోని వైఎంసీఏ నారాయణగూడలో ప్రధానంగా నిర్వహించే సదర్ ఉత్సవాలను దున్నలను తరలించారు.
బస్తీలలో దున్నలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రదర్శించడంతో పాటు నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. మల్లెపల్లి, సయ్యద్అలి గూడ, ఆసిఫ్నగర్, నాంపల్లి ఏడు గుళ్ల పోచమ్మ దేవాలయం, సీతారాంబాగ్ ప్రాంతాలలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
మంగళ్హాట్ డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ గుఫానగర్ ప్రాంతంలో కురుమ, యాదవ సంఘం తరపున నిర్వాహకులు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొని శ్రీకృష్ణునికి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముఖేష్సింగ్, పరమేశ్వరిసింగ్, నాయకులు వినోద్ యాదవ్, బీజేపీ నాయకులు ఠాకూర్ యమన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.