బేగంపేట్ : ఈ నెల 5 నుంచి 17 వరకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో కోటి కుంకు మార్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు దేవాలయం ఈవో గుత్తా మనోహార్రెడ్డి తెలిపారు.ఈ మేరకు బుధవారం మారేడ్పల్లిలోని మంత్రి నివాసంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను దేవాలయం ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి అందించారు.
5న శనివారం ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన, కలశస్థాపన కార్యక్రమాలు, ప్రతిరోజు సామూహిక శ్రీలలిత పారాయణం, కోటి కుంకుమార్చనలు నిర్వహిస్తారని తెలిపారు. చివరి రోజైన 17న గురువారం ఆలయ ప్రాంగణంలో శాంతి హోమం, పూర్ణాహుతి విశేష పూజలుంటాయని అన్నారు.