ముషీరాబాద్ : రాంనగర్ డివిజన్ హరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చిత్ర పటానికి మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాసరెడ్డి ఆదివారం క్షీరాభిషేకం చేశారు. నాయిని హోంమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించిన నిధులతో హరినగర్ కమ్యూనిటీ హాల్ స్లాబు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ అసోసియేషన్ ప్రతినిధులు నాయిని చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రేశం మల్లేశ్, సిరిగిరి శ్యామ్, బొమ్మిడి వీరాస్వామి, సత్యనారాయణ, అరుణ్, అమిత్, ఇజాజ్, సోను, ఎలిజబెత్, కల్పన, సబిత, తిరుమల, కమిటీ ప్రతినిధులు శ్రీహరి యాదవ్, ఎం.నర్సింహ్మ, నర్సింహాచారి, ప్రవీణ్, సురేశ్బాబు, మేఘనాథ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.